అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డులలో ఒకటైన గుర్తింపుని ఇచ్చే అవార్డ్ హుఫ్ఫింగ్టన్ ఈ అవార్డు ని అనేక రంగాలలో అంటే విద్య, వైద్యం, అక్షరాస్యత రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఇస్తారు.అయితే ఈ మూడు రంగాలలో ఇండో అమెరికన్ దంపతులు ఇద్దరూ ఎంతో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఈ గుర్తింపుని అందించారు.
ఈ ఇండో అమెరికన్ దంపతుల పేర్లు మేరీ , విజయ్ గొరాడియా దంపతులకు లభించింది.విద్య, ఆరోగ్యంపై కొన్ని దశాబ్దాలుగా ఇండియాలో వీరు సేవలు అందిస్తున్నారు.గతంలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి ట్రిల్లర్సన్, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్ వంటి ప్రపంచ ప్రముఖులకు ఈ పురస్కారం ప్రదానం చేశారు.
విజయ్ గొరాడియా (67) విన్నర్ ఇంటర్నేషనల్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ అవార్డు భారతీయ సంతతికి చెందినా దంపతులకి రావడంతో అక్కడ ఎన్నారైలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు