అదృష్టం అనేది చెప్పి రాదు.ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో కూడా చెప్పలేం.
అందుకే అదృష్టం తలుపు తట్టినపుడు ఉబ్బి తబ్బిబ్బయ్యిపోతాం.దుబాయ్ కు చెందిన ఓ భారతీయుడికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.
లాటరీల ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించిన ఓ భారతీయ యువకుడికి కాస్త లేట్ గా అయినా అదృష్టం మాత్రం అదిరిపోయేలా దక్కింది.ఎన్నో ఏళ్ళుగా లాటరీ కొనుగోలు చేస్తున్నా దక్కని లక్కు ఇప్పుడు అతడిని వరించడంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు.
వివరాలలోకి వెళ్తే.
కేరళా కు చెందిన రాహుల్ అనే 34 ఏళ్ళ వ్యక్తీ ఎన్నో ఏళ్ళ క్రితమే దుబాయ్ లో స్థిరపడ్డాడు.
అక్కడ ఓ ట్రాన్స్పోర్ట్ సంస్థలో ఫైనాన్స్ ఆఫీసర్ గా చేస్తున్న రాహుల్ కు లాటరీలు కొనడం, అద్రుష్టాన్ని పరీక్షించుకోవడం అలావాటుగా మారింది.ఈ క్రమంలోనే తన స్నేహితులు దాదాపు 24 మందితో కలిసి లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసేవాడు.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రాహుల్ డ్యూటీ ఫ్రీ మిలీనియం లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేశాడు.తనతో పాటు తన స్నేహితులు అందరూ టిక్కెట్లు కొనుగోలు చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు.
అయితే ఊహించని విధంగా రాహుల్ కొన్న టిక్కెట్టు కు భారీ జాక్ పాట్ తగిలింది.దాదాపు 1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.7 కోట్లు పైమాటే గెలుచుకున్నాడు రాహుల్.ఈ విషయం పై స్పందించిన రాహుల్ ఎన్నో ఏళ్ళుగా టిక్కెట్టు కొనుగోలు చేస్తున్నా ఎప్పుడు లాటరీ తగలలేదని, ఈ సారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడం సంతోషంగా ఉందని అన్నారు.
గెలిచిన దానిలో కొంత సహా ఉద్యోగులకు కూడా ఇస్తానని, మిగిలిన దానిని పిల్లలకోసం దాచుకుంటానని రాహుల్ తెలిపారు.ఇదిలాఉంటే దుబాయ్ లో డ్యూటీ ఫ్రీ మిలీనియం ఎన్నో ఏళ్ళుగా లాటరీ నిర్వహిస్తోంది ఇప్పటి వరకూ దాదాపు 177 మంది భారతీయులు ఈ ఫ్రీ మిలీనియం లాటరీ గెలుచుకున్నారట.