ఉన్నతమైన భవిష్యత్తు, చేతినిండా డబ్బు, ఆర్ధికంగా వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా ఉండాలంటే ఎన్నారై అయిపోవాలి.నిజాన్నిఒప్పుకోవాలి మరి.
విదేశాలలో ఉంటూ స్వదేశంలో ఉంటున్న తమ వారికి కోట్ల కొద్దీ డబ్బు పంపుతున్నారట మన భారత ఎన్నారైలు.ఈ విషయం వెల్లడించింది ఎవరో కాదు.
ప్రపంచ బ్యాంక్.తాజా నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం.
స్వదేశంలో ఉంటున్న తమ వారికి డబ్బులు పంపుతున్న వారిలో అత్యధికులు భారతీయులేనని తన తాజా నివేదికలో తెలిపింది.ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చితే విదేశాలకి వెళ్లేవారిలో అత్యధికులు భారతీయులేనని నివేదికలో పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం సుమారు 17 మిలియన్ల మంది భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారట.
ఇలా విదేశాలలో ఉంటూనే స్వదేశంలో ఉన్న తమవారికి 79 బిలియన్ డాలర్లకి పైగానే సంపద విదేశీ రెమిటెన్స్ పేరు మీద వచ్చిందట.విదేశాలలో జీవనోపాది పొందే వారిలో మొదటి స్థానంలో భారత్ ఉంటే రెండవ స్థానంలో ఉందట.భాతీయులు ఎందులోనూ తీసి పోరు అనడానికి ఇదొక ఉదాహరణనే చెప్పాలి.
.