అమెరికాలో ఉంటున్న ఇండో అమెరికన్స్ కి అందాల పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ గా కిరీటాన్ని ఇండో-అమెరికన్ 22 ఏళ్ల శ్రీ షైని గెలుచుకుంది.
అమెరికాలోని న్యూజెర్సీలోని ఫోర్డ్స్ సిటీలో జరిగిన ఈ పోటీల్లో మొదటి రన్నరప్ గా మరొక ఎన్నారై సాక్షి సిన్హా గెలుపొందారు ఈమె ఆస్ట్రేలియా కి చెందినా ఎన్నారై.ఇక రెండో రన్నరప్గా బ్రిటన్కు చెందిన అనుషా షరీన్ నిలిచారు.
అయితే కొన్నేళ్లుగా ప్రవాస భారతీయ యువతుల కోసం న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న ఇండియా ఫెస్టివల్ కమిటీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.మిస్ ఇండియా వరల్డ్ వైడ్ విజేత శ్రీషైనీ ఈ సందర్భంగా మాట్లాడుతూ 12 ఏండ్ల వయస్సులోనే తనకు వైద్యులు పేస్మేకర్ అమర్చారని, జీవితంలో ఎప్పుడూ నృత్యం చేయొద్దని సూచించారని చెప్పారు…కాని
తన జీవితంలో తన కలల సాధనకు ఎంతో స్రమించానని , ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే మిస్ వరల్డ్ టైటిల్ను గెలుపొందటం తనకలగా ఆమె తెలిపోఆరు.ఇదిలాఉంటే శ్రీ షైని 15 ఏండ్ల వయస్సులోనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రజలకు సేవ చేయడం విశేషం.
తాజా వార్తలు