సినిమా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక అవార్డులుగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతుంది.ఈ అవార్డుల వేడుకలో ఇప్పటికే బెస్ట్ ఫారిన్ మూవీ కేటగిరీలో మెక్సికన్ మూవీ రోమా ఉత్తమ చిత్రంగా అవార్డ్ దక్కించుకుంది.
అలాగే రోమా సినిమాలో నటించిన నాటికీ ఉత్తమ నటిగా అవార్డ్ వరించింది.అలాగే ఈ రేస్ లో హాలీవుడ్ బ్లాక్ సూపర్ హీరో మూవీ అయిన బ్లాక్ పాంథర్ సినిమా ఆస్కార్ బరిలో వివిధ కేటగిరీలలో సత్తా చాటుతుంది.
ఇదిలా వుంటే ఈ ఆస్కార్ బరిలో ఈ సారి భారత్ కూడా మెరిసింది అని చెప్పాలి.ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో పోటీ పడ్డ పీరియడ్, ఎండ్ అఫ్ సెంటెన్స్ సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డ్ సొంతం చేసుకుంది.
ఇండియాలో గ్రామీణ ప్రాంతాలలో నివసించే మహిళలు పీరియడ్స్ టైం లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనే విషయంపై తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డ్ దక్కించుకోవడం విశేషం.
.