దుబాయ్ కంట్రీస్ లో ఉండే భారతీయులకి లక్కు పాకెట్ లో ఉంటుందని అంటుంటారు.అది నిజమే అనే విషయం తరుచూ కొన్ని కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తూనే ఉంటుంది.
ఇలాంటి సంఘటనే తాజాగా యూఏఈ లో చోటు చేసుకుంది.ఓ భారతీయుడి తలుపుని అదృష్టం మాములుగా కొట్టలేదు.అబుదాబిలో నిర్వహించిన డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ సిరీస్ లక్కీ డ్రా లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 4 మిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీలో రూ.27.67 కోట్లు బహుమతిని గెలుపొందాడు.షార్జాలో నివసించే అతడికి ఈ భారీ బహుమతి దక్కింది.
అతడి పేరు కేఎస్ శోజిత్ షార్జాలో ఉంటాడు.
ఏప్రిల్ 1న ఆన్లైన్ లో కొన్న ఓ లాటరీ టిక్కెట్ కు నిన్నటి రోజున నిర్వహించిన డ్రాలో మొదటి బహుమతి వచ్చింది.
అంతేకాదు ఇదే డ్రాలో మరో ప్రవాసభారతీయుడు మంగేశ్ మైండే కి అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ 220ఐ కారు బహుమతిగా వచ్చింది.ఈ ఇద్దరు భారతీయులు మాత్రమే కాకుండా మరో 8 మంది భారతీయులు పలు బహుమతులు సొంత చేసుకున్నారు.