భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి సింగపూర్ లో అలజడి సృష్టించాడు, సింగపూర్ లోని ప్రజలు పోలీసులు దాదాపు పన్నెండు గంటలు గుండెలు చేత్తో పట్టుకున్నారు.ఇంతకీ ఆ వ్యక్తి చేసిన నా పని ఏంటి, అంతగా వారిని భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన ఏంటి, అనే వివరాల్లోకి వెళితే…
మరిముత్తు అనే భారత సంతతికి చెందిన వ్యక్తి సింగపూర్ దేశ అధ్యక్షుడు భవనం ముందు ఓ గ్రేనేట్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.అటుగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆ గ్రేనేట్ చూసి భయభ్రాంతులకు గురై వెంటనే సింగపూర్ పోలీసులకు సమాచారం అందించాడు.దేశాధ్యక్షుడు నివాసం ముందు ఇలా జరగడంతో సుమారు 50 మంది పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు.
దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
ఉదయం ఏడు గంటలకు పెట్టిన గ్రేనేట్ వద్దకు పోలీసులు వెళ్లడానికి సుమారు సాయంత్రం 5:00 అయ్యింది.ఆ తరువాత ఆ గ్రేనేట్ నిజమైనది కాదని గుర్తించిన పోలీస్ అధికారులు ఈ పని ఎవరు చేశారనే కోణంలో సీసీ కెమెరాలను పరీక్షించగా స్థానికంగా రోడ్లను శుభ్రపరిచే భారత సంతతి వ్యక్తి మరిముత్తు ఈ పని చేశాడని గుర్తించారు.దాంతో కోర్టు ముందు అతడిని హాజరుపరిచి విచారించగా తాను ఆ గ్రేనేట్ సరదాగా పెట్టానని, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నాను ఇలా జరుగుతుందని అనుకోలేదు అని సమాధానం ఇచ్చాడు.
తెలియక చేసిన పని కాబట్టి అతడికి 4500 సింగపూర్ డాలర్లు జరిమానా విధించారు.
.