లక్కుంటే ఇంట్లో కూర్చున్నా కోట్లు వచ్చి వళ్ళో పడతాయి.ఎంత కష్టపడినా పెరగని బ్యాంక్ బ్యాలన్స్ లక్కుంటే చాలు అమాంతం పెరిగిపోతుంది.
అదేంటి అలా ఎలా అంటే ఈ సంఘటనే నిదర్శనం.యూఏఈలోని ఓ భారతీయ ఎన్నారై నక్క తోక తొక్కాడు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40 కోట్ల లాటరీలో గెలుచుకుని సంబరాలలో మునిగితేలుతున్నాడు.మరి సదరు భారతీయ సోదరుడికి ఈ లక్కు ఎలా వచ్చింది, ఆ డబ్బుతో అతడు ఏం చేయబోతున్నాడో చూద్దాం.భారత్ నుంచి ఎంతో మంది దుబాయ్ దేశాలకు వలస వెళ్తూ ఉంటారు.
అక్కడే వివధ ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తూ ఉంటారు.ఈ కోవలోనే కేరళాకు చెందిన అబ్డుసలాం అనే వ్యక్తి అబుదాభిలో ఉద్యోగం కోసం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.
అక్కడే ఓ చిన్న పాటి ఉద్యోగం చేసుకుంటూ కాలం గడుపుతున్న అతడికి లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టం పరీక్షించుకునే అలవాటు ఉంది.ఎన్నో సార్లు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసినా ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా రాలేదు.కానీ….
ఊహించని విధంగా అతడిని అదృష్టం తట్టి లేపింది.
ఎప్పటి లానే డిసెంబర్ 29 న అబుదాభీలో టిక్కెట్టు కొనుగోలు చేశాడు.అయితే తాజాగా సదరు సంస్థ వారు తీసిన డ్రాలో అబ్డుసలాం తాను కొన్న టిక్కెట్టును గెలుపొందాడు.
సుమారు లాటరీలో 2 కోట్ల దీరామ్స్ గెలుపొందాడు.అంటే ఇండియన్ కరెన్సీలో రూ.40 కోట్లు పై మాటే.అయితే ఈ టిక్కెట్టు గెలుపొందానని ప్రకటించగానే నమ్మసఖ్యం కాలేదని, దేవుడు తనను గెలిపించాడని సంతోషం వక్తం చేశాడు.
ఈ మొత్తాన్ని తన పిల్లల చదువుకు కొంత, సొంత ఇల్లు కట్టుకోవడానికి కొంత, అలాగే తన స్నేహితులకు కూడా పంచుతానని అబ్డుసలాం ప్రకటించాడు.