అమెరికాలో భారత్ కు చెందిన ఇద్దరు అన్నా చెల్లెళ్ళ అసామాన్య ప్రతిభ చూసి ముక్కున వేలేసుకుంటోంది అమెరికా ప్రజానీకం.డిగ్రీలకు డిగ్రీలు చదివిన ఎంతో మంది చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమతమై పోతున్న తరుణంలో తండ్రి మాటలు స్పూర్తిగా తీసుకున్న ఇద్దరు అన్నా చెల్లిళ్ళు నెలకు లక్షలు సంపాదిస్తున్నారు.
వారి సంపాదన ఏడాదికి కోట్లు దాటిపోతోంది.దాంతో అమెరికా వ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇద్దరు అన్నా చెల్లిళ్ళు హాట్ టాపిక్ గా నిలిచారు.
ఇంతకీ వీరి ఇద్దరి వయసు ఎంతో తెలుసా 15 ఏళ్ళ లోపే ఏంటి షాక్ అయ్యారా.సరే అసలు వాళ్ళెవరు, వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అనే వివరాలలోకి వెళ్తే.
ఇషాదాకుర్ వయసు 14 ఏళ్ళు, అతడి సోదరి అనన్య వయసు 9 ఏళ్ళు టెక్సాస్ లో ఉంటున్న వీరు తన తండ్రి పడుకునే ముందు చెప్పే కధలు వింటూ తెలివి తేటలు బాగా వంట పట్టించుకున్నారు.ఈ క్రమంలోనే ఓ రోజు తన తండ్రి క్రిప్టో కరెన్సీ గురించి చెప్పడంతో వీరి దృష్టి ఆదిసగా మళ్ళింది.
దాంతో క్రిప్టో కరెన్సీ గురించి క్షుణంగా తెలుసుకోవడం మొదలు పెట్టారు.దాంతో వారి క్రిప్టో కరెన్సీ కంటే కూడా ఇతెరియం గురించి స్టడీ చేశారు.ఇతెరియం బిట్ కాయిన్ కు గట్టిపోటీ అని గ్రహించిన వాళ్ళు ఇతెరియం కొనే పనిలో పడ్డారు.
అయితే ఇతెరియం కొనాలంటే ఆషామాషీ కాదు బోలెడు డబ్బులు కావాలి కాబట్టి తమ వద్ద ఉన్న గేమింగ్ ల్యాప్ట్ టాప్ ద్వారా ఇతెరియం మైనింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు.
వారి అంచనాలు నిజమవ్వడం మొదలయ్యింది కొద్ది కొద్దిగా డబ్బులు రావడంతో వారు మరింతగా తమ వ్యాపారాన్ని వృద్ది చేశారు.ఫలితంగా నెలకు దాదాపు 32 వేల డాలర్లు సంపాదిస్తున్నారు.
అంతేకాదు డల్లాస్ లో ఓ డేటా సెంటర్ కూడా మొదలు పెట్టారు.దాంతో మీడియా దృష్టిలో పడ్డారు.
కేవలం అమెరికాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఫేమస్ అయ్యారు.తాము సంపాదిస్తున్న డబ్బులు తమ పై చదువుల కోసం అలాగే మంచి పనులు చేయడానికి ఖర్చు చేస్తామని తెలిపారు.ఇంతకీ వీరి నెల సంపాదన ఎంతో తెలుసా అక్షరాలా రూ.23 లక్షలు.