ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ప్రెస్ సంచలన కథనాన్ని ప్రచురించడం జరిగింది.ఆ కథనంలో రాజధాని మార్పు గురించి ప్రముఖంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏపీకి రాజధాని విషయమై అనిశ్చితి నెలకొని ఉంది.కనుక అభివృద్ది అనేది కష్టంగా ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఏపీకి చెందిన చాలా మంది వ్యాపారులు హైదరాబాద్లో తమ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండేవారు.ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా ప్రకటించారో అప్పుడు హైదరాబాద్ నుండి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లారు.
ఇప్పుడు అమరావతిని రాజధాని కాదు అంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించడంతో అభివృద్ది అనేది తిరుగోతిలోకి మారింది అన్నాడు.ఏపీకి ప్రస్తుతం పెట్టుబడులు ఏమీ రావడం లేదు.ఏపీలో ఉన్న పరిస్థితులు హైదరాబాద్కు కలిసి వస్తున్నాయి.బిజినెస్ మరియు ఇతరత్ర విషయాలు అన్నింటికి కూడా ప్రస్తుతం ఏపీలో ఛాన్స్ లేదని, అందుకే హైదరాబాద్ను అంతా ఎంపిక చేసుకుంటున్నట్లుగా ఆ కథనంలో పేర్కొనడం జరిగింది.
రాజధాని మార్పుతో పాటు కొన్ని నిర్ణయాల వల్ల జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు అని, ఆయన తన ఫేమ్ను తానే పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మొత్తం రివర్స్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ ఈ సందర్బంగా ఈ కథనంలో పేర్కొన్నారు.