విడ్డూరం : చనిపోయాడనుకుని అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేశారు అప్పుడేం జరిగిందో తెలుసా?

డాక్టర్ల అశ్రద్ద గురించిన వార్తలు మనం అప్పుడప్పుడు చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం.అయితే డాక్టర్లు ఆపరేషన్‌ సమయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల జరిగిన పొరపాట గురించి ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాం.

 Indian Doctors Heedlessness-TeluguStop.com

అయితే తాజాగా జరిగిన సంఘటన మరీ దారుణం.ఒక మనిషి బతికి ఉండగానే చనిపోయాడు అంటూ చెప్పడంతో అతడి కుటుంబ సభ్యులు రోజంతా ఏడ్చేసి చివరకు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసి పాతి పెట్టేందుకు గొయ్యి కూడా తోవారు.

ఆ సమయంలోనే శవం చేతి వేళ్లు కదిలాయి.

శవం చేతి వేళ్లు కదలినట్లుగా అనిపించడంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు.

అక్కడ డాక్టర్‌ అతడు బతికే ఉన్నాడని, కోమాలోకి వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది.దాంతో వెంటనే హాస్పిటల్‌లో జాయిన్‌ చేసి వెంటలేటర్‌ మీద చికిత్స చేయడం జరిగింది.

ఇలాంటి దారుణాలు ఇతర దేశాల్లో ఎప్పుడు జరగలేదు.మన ఇండియాలోనే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

ఇండియాలోని డాక్టర్లు అశ్రద్ద కారణంగా బతికి ఉన్న వారు చనిపోతున్నారు.

విడ్డూరం : చనిపోయాడనుకుని అంత�

ఇండియాలో డాక్టర్లు అంతే అందరు అని కాదు.వందలో ఒక్కరు వెయ్యిల్లో ఒక్కరు మాత్రమే ఇలా ఉంటున్నారు.మిగిలిన వారు ప్రాణాలు కాపాడే దేవుళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కాని కొందరు మాత్రం ఇలా అశ్రధ్దతో ప్రాణాలనే తీస్తున్నారు.డాక్టర్‌ అంటే దేవుడు అని అంతా నమ్ముతూ ఉంటారు.

అలాంటి దేవుడు జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని ఈ సంఘటనతో మరోసారి నిరూపితం అయ్యింది.ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube