కరోనా వైరస్
వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచం అల్లాడుతున్న నేపథ్యంలో
దుబాయ్
లో ఓ
భారతీయుడు
హీరోగా మారాడు.ఇంతటి విపత్కర సమయంలోనూ అతను ఫుడ్ డెలివరీ బాయ్గా తన విధి నిర్వర్తిస్తున్నాడు.
దుబాయ్లో ఇప్పటి వరకు 570 మందికి కరోనా సోకగా ముగ్గురు మరణించారు.దీంతో వైరస్ను కట్టడి చేసేందుకు గాను యూఏఈ ప్రభుత్వం ఏప్రిల్ 5 వరకు లాక్డౌన్ ప్రకటించింది.
ఇందులో ఆహార పదార్థాలను హోమ్ డెలీవరి చేసే విభాగానికి, సంస్థలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
గత 15 సంవత్సరాలుగా దుబాయ్లో డెలీవరి బాయ్గా పనిచేస్తున్న భారత్కు చెందిన శంబంతం మాట్లాడుతూ.
తన జీవితంలో ఇలాంటి సమయం వస్తుందని తాను ఎప్పుడు భావించలేదని తెలిపాడు.ఈయన లాక్డౌన్ మధ్య తన రెగ్యులర్ వృత్తిని కొనసాగిస్తూ తమిళనాడులోని
అరియలూర్
లో ఉంటున్న కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు.
ఎవరైనా ఈ పని చేయాల్సిన అవసరం ఉందన్న మురళీ.ఎందుకంటే ఆహారం తప్పనిసరి వస్తువని అభిప్రాయపడ్డాడు.తాము ఇళ్లకు డోర్ డెలీవరి చేయకపోతే ఎంతోమంది ఆహారాన్ని కోల్పోతారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళితే వైరస్ సోకే ప్రమాదముందని తనకు తెలుసునన్నాడు.
అయితే బైక్పై రోడ్డు మీదకు వచ్చే టప్పుడు
ఫేస్ మాస్కులు
, గ్లౌజులు ధరిస్తానని చెప్పాడు.నోటి తుంపరలు పడిన ఉపరితలాలను తాకడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని అందువల్ల తాను డెలీవరి ఇచ్చిన ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకుంటానని చెప్పాడు.
అంతేకాకుండా డెలీవరి ఇచ్చే సమయంలో
కస్టమర్
తో కొంత దూరంగా ఉంటానని శంబాంతం చెప్పాడు.ఫుడ్ డెలీవరి చేసే వ్యక్తులు ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారని అటువంటి వారు వైరస్ను చూసి భయపడకూడదని మురళీ తన తోటి ఉద్యోగులకు చెబుతున్నాడు.
ఫుడ్ ప్యాకెట్లను అందుకునేటప్పుడు ప్రజలు సైతం జాగ్రత్తగా ఉంటున్నారని శంబాంతం అన్నారు.డెలీవరి తీసుకునేటప్పుడు వారు దిగువున తాకుతారని, తాను పై భాగాన్ని పట్టుకుంటానని తెలిపాడు.