పులి పంజా విసిరింది అంటే ఎంత బలంగా ఉంటుందో అందరికి తెలిసిందే.వేట ఆడడం మొదలుపెట్టిందా ఎలాంటి జంతువు అయినా సరే దానికి బలి కాక తప్పదు.
పులి బలం గురించి ఎంత చెప్పిన తక్కువే.నలుగురు మనుషులు కలిసి దానిని పట్టుకోవాలని చుసినాసరే అది సాధ్యం అయ్యే పని కాదు.
అలాంటిది మన ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ పులితో సరదాగా ఆట ఆడాడు.తాజాగా ఇన్స్టాగ్రామ్ లో యువరాజ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
రీసెంట్ గా దుబాయ్ లోని ఫేమ్ పార్క్ లో అక్కడి జంతువులతో యువరాజ్ ఎంజాయ్ చేస్తుండటం ఈ వీడియోలో మనం చూడొచ్చు.సుమారు నాలుగు నిమిషాల పాటు ఈ వీడియో ఉంటుంది.
ఈ వీడియోలో యువరాజ్ టైగర్ తో ఒక ఆట ఆడడం మనం చూడవచ్చు.టైగర్ తో ఓ లైగర్ టగ్ ఆఫ్ వార్ అంటూ పోటీ పడ్డాడు.
టైగర్ వెర్సస్ లైగర్ అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు.యువరాజ్ తోపాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా టైగర్ తో పోటీ పడ్డారు.ఒకవైపు ముగ్గురు కలిసి తాడును ఎంత బలంగా లాగుతున్న గాని పులి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అంటే అర్ధం చేసుకోండి దాని బలం ఎంత ఉందో అని.అయితే తుది ఫలితం ఏంటో మీకు తెలిసే ఉంటుంది అని.
అలాగే ఈ టగ్ ఆఫ్ వార్ ఒక్కటే కాకుండా ఆ తర్వాత ఓ భారీ కొండచిలువను కూడా మెడలో వేసుకోవడం మనం ఫొటోలో చూడవచ్చు.అలాగే కొన్ని జంతువులకు ఆహారం కూడా తినిపించడం మనం వీడియోలో చూడవచ్చు.ఆహారం తినిపించే క్రమంలో ఏ ఒక్క జంతువు కూడా ఎవరికీ హాని కలిగించకపోవడం విశేషం అని చెప్పాలి.కాగా ఫేమ్ పార్క్ జంతువులకు ఎంతో సురక్షితమైన ప్రదేశమని యువరాజ్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.కాగా ఈ వీడియో తీసే సమయంలో ఏ జంతువుకూ కూడా హాని కలిగించలేదని యువరాజ్ స్పష్టత ఇచ్చారు.
మరి ఈ అద్భుతమైన వీడియోను మీరు కూడా చూసి ఆనందించండి.