భారత సంతతి దంపతుల అభ్యర్ధన... ఇదో విషాద సంఘటన..!!!

పెళ్లై ఏళ్ళు గడిచిన పిల్లలు పుట్టకపోతే ఆ దంపతులు పడే బాధను వివరించలేరు.పిల్లల కోసం పరితపించే ఆ జంటకు పెళ్ళైన 8 సమత్సరాల తరువాత ఒక పండండి మగ బిడ్డ పుడితే వారి ఆనందానికి అవధులు ఉండవు.

 Indian Couples Request Please Save My Child-TeluguStop.com

కానీ, ఆ పసికందు, పుట్టుకతోనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నడనే వార్త ఆ తల్లితండ్రులకు తెలియగానే ఎంత దుఖానికి గురవుతారో.ఇలాంటి ఒక సంఘటనే గల్ఫ్ లో ఓ భారతీయ దంపతులకు ఎదురైంది.

రెసిల్ వాసుదేవన్, ఉపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితమే భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు.అక్కడే ఒక సంస్థలో చేరి ఉద్యోగం చేసుకుంటూ,శ్రుతి అనే యువతిని పెళ్ళాడి అతనితో పాటు గల్ఫ్ తీసుకెళ్ళాడు.

అయితే,పెళ్ళైన 8 ఏళ్ళ తరువాత వారికి మగబిడ్డ పుట్టాడు, వాడి పేరు అతర్వ.అతర్వ్ వయసు నాలుగు నెలల 16 రోజులు.అయితే అతర్వ్ పుట్టుకతోనే ప్రాణాంతక సమస్యతో పోరాటం చేశాడు.డాక్టర్లు, ఆ పసికందుకు ఇప్పటికే కన్ను, మెదడు,పొట్టకు, సుమారు 4 ఆపరేషన్లు చేశారు.

పుట్టినప్పటి నుంచి అతర్వ్ హాస్పిటల్లోనే ఉన్న అతర్వ్ ను డాక్టర్లు త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.అందుకు సంతోషంగానే ఉన్నా, వైద్యానికైన ఖర్చు సుమారు మూడున్నర కోట్లు, ఇది వాసుదేవన్ కు కొచెం కష్టమైన పనే.ఈ నేపధ్యంలోనే.

అక్కడ స్థానికి మీడియాతో మాట్లాడిన వాసుదేవన్,” తన కొడుకు పుట్టినప్పటి నుంచి చికిత్స కొరకు హాస్పిటల్లోనే ఉన్నాడని,4 ఆపరేషన్స్ చేశారని, త్వరలో డిశ్చార్జ్ అవుతున్నదని చెప్పుక్కోచ్చాడు.

అయితే,ఖర్చు మూడున్నర కోట్లు అవడంతో, తను కొంత మొత్తం సర్దుబాటు చేసుకున్నానని, మిగత డబ్బు కోసం ఆర్ధిక సాయం కోసం ఎదురు చూస్తూ, కొన్ని స్వచ్చంద సంస్థల్లో తెలియజేశానని తెలిపాడు.ఆర్ధిక సాయం కోసం భారత్ దంపతులు ఎదురు చూపులు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube