ఈ మధ్యకాలంలో రాబరీలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.దోపిడీలకు పాల్పడడం… అడ్డొచ్చిన వారి ప్రాణాలను తీసేయడం.
ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.తాజాగా ఇలాంటి ఘటన జరిగింది.
భారతీయ దంపతులను ఓ పాకిస్తానీ దారుణంగా హత్య చేశాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనం గా మారిపోయింది.
భారత్కు చెందిన దంపతులు హిరెన్ అధియా, విధి అధియా లు దుబాయ్ లో స్థిరపడ్డారు.దుబాయ్ లోని అరేబియన్ రాంచెస్ లో నివాసముంటు.
షార్జాలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే ఈ ఇద్దరు దంపతులపై పాకిస్తానీ కన్నేశాడు.
ఈ క్రమంలోనే వీరిద్దరూ వద్ద దోపిడీ చేయాలని భావించి ప్లాన్ వేసాడు.కానీ వారు సహకరించకపోవడంతో ఏకంగా దంపతులను కిరాతకంగా చంపి డబ్బు బంగారం దోచుకుని పరారయ్యారు.
ఈనెల 18న ఈ దారుణ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేవలం డబ్బులు నగల కోసమే భారత్ కు చెందిన ఇద్దరు దంపతులను పాకిస్థానీ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇక అతన్ని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల వెనుకకు తోశారు.ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.