డబ్బు నగల కోసం ఆ పాకిస్తానీ ఎంత పని చేసాడో తెలుసా..?

ఈ మధ్యకాలంలో రాబరీలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.దోపిడీలకు పాల్పడడం… అడ్డొచ్చిన వారి ప్రాణాలను తీసేయడం.

 Indian Couple, Pakistani, Dubai Police, Money, Pakistani Killed Indian Couple Fo-TeluguStop.com

ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.తాజాగా ఇలాంటి ఘటన జరిగింది.

భారతీయ దంపతులను ఓ పాకిస్తానీ దారుణంగా హత్య చేశాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనం గా మారిపోయింది.

భారత్కు చెందిన దంపతులు హిరెన్ అధియా, విధి అధియా లు దుబాయ్ లో స్థిరపడ్డారు.దుబాయ్ లోని అరేబియన్ రాంచెస్ లో నివాసముంటు.

షార్జాలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే ఈ ఇద్దరు దంపతులపై పాకిస్తానీ కన్నేశాడు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ వద్ద దోపిడీ చేయాలని భావించి ప్లాన్ వేసాడు.కానీ వారు సహకరించకపోవడంతో ఏకంగా దంపతులను కిరాతకంగా చంపి డబ్బు బంగారం దోచుకుని పరారయ్యారు.

ఈనెల 18న ఈ దారుణ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేవలం డబ్బులు నగల కోసమే భారత్ కు చెందిన ఇద్దరు దంపతులను పాకిస్థానీ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇక అతన్ని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల వెనుకకు తోశారు.ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube