మేడం టుస్సాడ్స్ మ్యూజియం.ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మ్యూజియం.
ఆయా రంగాల్లో మంచి ప్రతిభ కనబర్చిన సెలలబ్రిటీల మైనపు విగ్రహాలు ఇందులో పొందుపరుస్తారు.నిజానికి ఫ్రాన్స్ లో పుట్టిన అన్నా మారియా గ్రొష్జాల్… ఫ్రాంకోయిస్ టుస్సాడ్స్ అనే యువకుడిని వివాహం చేసుకుంది.
ఆ తర్వాత తను మేడమ్ టుస్సాడ్స్ అయ్యింది.చిన్నప్పటి నుంచి తను మైనపు బొమ్మలు చచేసే వ్యక్తి దగ్గర పెరిగడం మూలంగా తను కూడా మైనపు విగ్రహాలు చేయడం మొదలు పెట్టింది.
అందులో మంచి పట్టు సాధించింది.కేవలం ప్రముఖుల బొమ్మలు తయారు చేయడం పైనే తను దృష్టి పెట్టింది.
అలా ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో టుస్సాడ్స్ మ్యూజియాలు ఏర్పాటు చేసింది.వీటిలో అత్యంత ప్రముఖమైన మ్యూజియం లండన్ లో ఉంది.
ప్రస్తుతం ఈ మ్యూజియాలు సింగపూర్, హాంకాంగ్, ఢిల్లీలో కూడా టుస్సాడ్స్ మ్యూజియాలు ఉన్నాయి.ఇంతకీ ఈ మ్యూజియంలో ఉన్న భారతీయ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
అమితాబ్ బచ్చన్
టుస్సాడ్స్ మ్యూజియంలో ప్లేస్ కొట్టేసిన ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ బిగ్ బీ. ఇండియనే కాదు.ఆసియాకు చెందిన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.2000 సంవత్సరంలో అమితాబ్ మైనపు విగ్రహం లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరింది.
ఐశ్వర్యా రాయ్
అమితాబ్ తర్వాత స్థానం దక్కించుకున్న మరో సెలబ్రిటీ ఐశ్వర్యా రాయ్.2004లో లండన్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.2013లో మరో విగ్రహాన్ని న్యూయార్క్ మ్యూజియంలో పెట్టారు.
షారూక్ ఖాన్
2007లో ఈయన మైనపు విగ్రహం మేడం టుస్సాడ్స్ లో కొలువు దీరింది.ప్రస్తుతం నాలుగు మైనపు విగ్రహాలు ఆయనా మ్యూజియాల్లో ఏర్పాటు చేశారు.
సల్మాన్ ఖాన్
2008లో టుస్సాడ్స్ మ్యూజియంలో సల్మాన్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.2012లో న్యూయార్క్ లో మరో విగ్రహాన్ని పొందుపర్చారు.
హృతిక్ రోషన్
ధూమ్ 2 సినిమా తర్వాత హృతిక్ స్టాట్యూ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేశారు.ఈ విగ్రహాన్ని ఎక్కువ మంది కిస్ చేసినట్లు మ్యూజియం రికార్డులు చెప్తున్నాయి.
కరీనా కపూర్
ఐశ్వర్య తర్వాత టుస్సాడ్స్ లో స్థానం దక్కించుకున్న నటి కరీనా కపూర్.మొదట ఈమె విగ్రహాన్ని సింగపూర్ లో ఏర్పాటు చేశారు.అనంతరం రెండో విగ్రహాన్ని ఢిల్లీలో పొందు పర్చారు.
మాధూరి దీక్షిత్
ఈమె విగ్రహాన్ని తొలుత లండన్ లో.ఆ తర్వాత ఢిల్లీలో ఏర్పాటు చేశారు.
ప్రభాస్
టుస్సాడ్స్ లో స్థానం దక్కించుకున్న ఫస్ట్ సౌతిండియన్ సెలబ్రిటీ ప్రభాస్.బాహుబలిని పోలిన తన విగ్రహం టుస్సాడ్స్ లో కొలువు దీరింది.
మహేశ్ బాబు
ప్రభాస్ తర్వాత స్థానం దక్కించుకున్న నటుడు మహేష్ బాబు.ఈయన విగ్రహాన్ని సింగపూర్ మ్యూజియంలో పెట్టారు.
కాజల్ అగర్వాల్
మేడం టుస్సాడ్స్ లో స్థానం దక్కించుకున్న సౌతిండియా హీరోయిన్ గా పేరుపొందింది.ఈమె తర్వాత మరే నటికి ఆ ప్లేస్ దక్కలేదు.