భారత సంతతికి చెందిన ఇద్దరు భారతీయ సోదరులు బ్రిటన్ లో రికార్డ్ సృష్టించారు.బ్రిటన్ లోనే అత్యధిక సంపన్నులుగా తమ ఆధిక్యతని ప్రదర్శించారు.
దాదాపు 22 బిలియన్ పౌండ్లతో హిందుజా సోదరులు నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ముంబై లో పుట్టిన ఈ రూబెన్ సోదరులు 18.66 బిలియన్ పౌండ్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.లండన్ లో పుట్టిన హిందుజా గ్రూప్ అధినేతలు శ్రీచంద్, గోపీ చంద్ లు గత ఏడాది కన్నా అధిక ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచారని సండే టైమ్స్ తెలిపింది.
వీరి వ్యాపార సామ్రాజ్యం మాంసపు ఉత్పత్తుల మొదలు, ఆల్కహాల్ , గ్యాస్, ఐటీ, మీడియా, బ్యాంకింగ్ రియలెస్టేట్ మొదలగు అనేక రంగాలలో విస్తరించి ఉంది.అన్ని విషయాల్లో తమ కంపెనీని ఎంతో విజయపధంలో నడిపిస్తున్నారు ఈ సోదరులు.
వీరు హిందుజా ఆటోమోటివ్స్ ద్వారా 50శాతం పైగానే అంటే దాదాపు 337 మిలియన్ పౌండ్ల లాభాలు ఆర్జించి సంపన్నుల జాబితాలో నిలిచారు.
ఇదిలాఉంటే లండన్ లో అత్యంత ఖరీదైన మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రికి చెందిన వైట్ హాల్ ని కొనుగోలు చేసి దాన్ని లగ్జరీ హోటల్గా మార్పు చేస్తున్నారు.అలాగే , ముంబై కి చెందిన డేవిడ్ 80వ స్థానంలో , 77వ స్థానంలో సైమన్ లండన్ లో వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు.