భారత ఆర్మీ మరింత పటిష్టంగా మారింది.సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీకి రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధునాతన ఆయుధాలు అందించారు.
తూర్పు లద్దాఖ్ లో సైన్యానికి యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్ నిపుణ్ తో పాటు ల్యాండింగ్ అటాక్ క్రాఫ్ట్ ను, సరికొత్త బోటును కూడా అందించారు.
అదేవిధంగా పాంగాంగ్ సరస్సులో పెట్రోలింగ్ కోసం నూతన కొత్త బోట్లు ఎంతగానో వినియోగపడనున్నాయి.
ఒకేసారి 35 ట్రూప్స్ వెళ్లేలా కొత్త బోట్లను డిజైన్ చేశారు అధికారులు.సరస్సు పరిసర ప్రాంతాలకు ఈ బోట్లు క్షణాల్లో చేరుకుంటాయి.
అధునాతన వెపన్స్ మేడిన్ ఇండియా డిఫెన్స్ సిస్టమ్ తో తూర్పు లద్దాఖ్ లో భారత ఆర్మీ ఫుల్ జోష్ లో ఉంది.