పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి 44 మంది జవాన్ల మృతికి కారణం అయిన జైషే ఎ మహ్మద్ టెర్రరిస్ట్ సంస్థ సభ్యులు, దాడి సూత్రధారి ఘాజీని ఈరోజు పింగ్లాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రత దళాలు హతం చేసాయి.ఓ ఇంట్లో టెర్రరిస్ట్ లో చొరబడినట్లు సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో దాడులు మొదలెట్టారు.
ఈ దాడిలో కాన్వాయ్ పై దాడికి సూత్రధారి అయిన ఘాజీని హతం చేసాయి.అతనితో పాటు మరో కమాండర్ కమ్రాన్ కి కూడా భద్రతా దళాలు హతం చేసాయి.
ఈ ఎన్ కౌంటర్ తో పుల్వామా దాడికి మాస్టర్ మైండ్ గా, ప్లాన్ ని అమలు చేసిన ఘాజీని హతం చేయడం ద్వారా జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థకి ఇండియన్ ఆర్మీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ దాడులని ఇలాగె కొనసాగించి, ఉగ్రవాద స్థావరాలపై దాడులు ముమ్మరం చేయాలని కేంద్రం హోం శాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అలా కాకుంటే పాకిస్తాన్ ని ఆర్ధికంగా దెబ్బ తీసే అవకాశాలని కూడా భారత ప్రభుత్వం వినియోగించుకొని ఉగ్రవాద దేశానికి గట్టి దెబ్బ తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
.