పుల్వామా ఆర్మీ కాన్వాయ్ పై దాడి సూత్రధారి హతం!

పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి 44 మంది జవాన్ల మృతికి కారణం అయిన జైషే ఎ మహ్మద్ టెర్రరిస్ట్ సంస్థ సభ్యులు, దాడి సూత్రధారి ఘాజీని ఈరోజు పింగ్లాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రత దళాలు హతం చేసాయి.ఓ ఇంట్లో టెర్రరిస్ట్ లో చొరబడినట్లు సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో దాడులు మొదలెట్టారు.

 Indian Army Encounter Pulwama Attack Master Mind-TeluguStop.com

ఈ దాడిలో కాన్వాయ్ పై దాడికి సూత్రధారి అయిన ఘాజీని హతం చేసాయి.అతనితో పాటు మరో కమాండర్ కమ్రాన్ కి కూడా భద్రతా దళాలు హతం చేసాయి.

ఈ ఎన్ కౌంటర్ తో పుల్వామా దాడికి మాస్టర్ మైండ్ గా, ప్లాన్ ని అమలు చేసిన ఘాజీని హతం చేయడం ద్వారా జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థకి ఇండియన్ ఆర్మీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ దాడులని ఇలాగె కొనసాగించి, ఉగ్రవాద స్థావరాలపై దాడులు ముమ్మరం చేయాలని కేంద్రం హోం శాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

అలా కాకుంటే పాకిస్తాన్ ని ఆర్ధికంగా దెబ్బ తీసే అవకాశాలని కూడా భారత ప్రభుత్వం వినియోగించుకొని ఉగ్రవాద దేశానికి గట్టి దెబ్బ తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube