భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావన్ తాజాగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి దూసుకు వెళ్తామన్నాడు.
పాక్ ఆక్రమిత కశ్మీర్కు విముక్తి కలిగించేందుకు తముకు ఎక్కువ సమయం పట్టదని ఆయన అన్నారు.ఈ విషయమై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ఆర్మీ చీఫ్ హోదాలో రావన్ పేర్కొన్నారు.
ఇటీవలే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పీఓకేను త్వరలోనే పాకిస్తాన్ నుండి స్వాదీనం చేసుకుంటామని చెప్పడం జరిగింది.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై బిపిన్ రావన్ పై విధంగా స్పందించారు.
పీఓకేను భారత్లో అంతర్బాగంగా చేయడమే తమ తదుపరి లక్ష్యం అంటూ బిపిన్ పేర్కొన్నారు.ప్రభుత్వం నుండి వచ్చే అనుమతి కోసం తాము ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొంది.
కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విషయమై స్పందించాడు.పీఓకే ఎప్పటికి భారత్దే అని, ఖచ్చితంగా దాన్ని స్వాదీనం చేసుకుంటామంటూ మోడీ పేర్కొన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో ఇండియాపై విమర్శలు చేస్తూనే ఉంది.దేశ ప్రజలు మొత్తం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఓకే స్వాదీన పక్రియ త్వరలోనే ప్రారంభం అవ్వాలని కోరుకుందాం.
ఇందులో ఇండియన్ ఆర్మీ ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండాలని ఆశిద్దాం.