యూరీ ఘటన తర్వత పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడి టెర్రరిస్ట్ లని హతం చేసి, వారి స్థావరాలని నాశనం చేసిన ఇండియన్ ఆర్మీ, ఈ సారి కూడా పుల్వామా ఎటాక్ తర్వాత అలాంటి తరహాలోనే పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ లపై దాడులు చేయాలని నిర్ణయించుకుంది.ఓ వైపు పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొస్తూ, మరో వైపు బోర్డర్ లో బలగాలు మొహరించి యుద్ధానికి రెడీ అవుతున్నట్లు వారిని భయపెట్టి, ఊహించని విధంగా ఆ దేశానికి షాక్ ఇచ్చింది.
పాకిస్తాన్ ఆర్మీ ఇండియాతో ఎ క్షణం అయిన యుద్ధం వచ్చే అవకాశాలు వున్నాయని ఆర్మీ మొత్తాన్ని సరిహద్దు దగ్గర మొహరించి ఉంచింది.ఇదే అవకాశంగా తీసుకున్న ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ తరహాలో కాకుండా ఈ సారి గగనతలం నుంచి ఎయిర్ స్ట్రైక్ చేసి జైషే స్థావరాలపై బాంబుల వర్షం కురుపించింది.
ఈ దాడిలో జైషే స్థావరాలు చాలా వరకు ద్వంసం అయినట్లు తెలుస్తుంది.అయితే ఈ స్ట్రైక్ దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు హతం అయ్యారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ఒప్పుకున్న, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గగనతల నిబంధనలు అతిక్రమించి పాకిస్తాన్ లో ప్రవేశించింది అని ఆరోపణలు చేస్తుంది.