కార్పోరేట్ ప్రపంచంలో సంచలనం కలిగించిన అమెజాన్ ముడుపుల కేసులో తెలుగు ఎన్ఆర్ఐ సహా ఆరుగురిపై నేరారోపణ అభియోగాలు నమోదయ్యాయి.వీరిని యూఎస్ గ్రాండ్ జ్యూరీ విచారించనుంది.వీరంతా అమెజాన్ మార్కెట్ ప్లేస్లో అక్రమ మార్గం ద్వారా ప్రయోజనం పొందేందుకు సంస్థ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు సుమారు లక్ష డాలర్లను ముడుపులుగా చెల్లించడంతో పాటు కుట్రకు పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది.
2017 నుంచి వీరు అక్రమంగా సంపాదిస్తున్నారు. థర్డ్ పార్టీ మర్చంట్స్, అనధికారిక కంప్యూటర్ వ్యవస్థ ద్వారా పోటీదారులకు, వినియోగదారులకు హాని కలిగే విధంగా తమ వస్తువులనే అమ్మడానికి ప్రయత్నించారని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో హైదరాబాద్కు చెందిన నిషాద్ కుంజు (31), కాలిఫోర్నియాకు చెందిన రోహిత్ కడిమిశెట్టి ( 27), న్యూయార్క్కు చెందిన ఎఫ్రాయిమ్ రోసెన్బర్గ్ (45), జోసెఫ్ నిల్సెన్ (31), క్రిస్టెన్ లెక్సీ (30) జార్జియాకు చెందిన హడిస్ నుహానోవివ్ (30) ఉన్నారు.
ఈ ఆరుగురిని అక్టోబర్ 15న సీటెట్లోని కోర్టులో హాజరు పరచనున్నారు.ఈ కుట్రలో భాగంగా వీరు పదిమంది అమెజాన్ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ముడుపులు చెల్లించినట్లు అమెరికా అటార్నీ జనరల్ బ్రియాన్ మోరాన్ తెలిపారు.