అమెరికాలో ఎంతో మంది భారతీయులు వివిధ రంగాలలో నిష్ణాతులుగా, చక్కని ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థానాలని చేరుకున్నారు.మరి కొందరు వ్యాపార, రాజకీయ రంగాలలో అమెరికన్స్ కంటే కూడా దూసుకువెళ్తున్నారు.
అయితే వారు మాత్రమే కాకుండా వారి పిల్లలని కూడా అక్కడి పోటీ ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చి దిద్దుతున్నారు.తాజాగా అమెరికాలో జరిగిన ప్రముఖ క్విజ్ షో లో భారత సంతతి విద్యార్ధి మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు.
భారత సంతతికి చెందిన అవి గుప్తా అనే విద్యార్ధి ప్రఖ్యాత క్విజ్ షో జియోపార్డీ లో సుమారు లక్ష డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో సుమారు 69 లక్షలు సొంతం చేసుకున్నాడు.ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఇదే పోటీ లో గుప్తా మరి ముగ్గురు భారత సంతతి వ్యక్తులని ఓడించి మరీ మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు.
తనకి ఈ బహుమతి దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, ఊహించని విజయం తనని వరించిందని తెలిపాడు గుప్తా.
ఇదిలాఉంటే గత సంవత్సరం జరిగిన జియోపార్డీని పోటీలలో కూడా భారత సంతతి విద్యార్ధి అయిన ధ్రువ్ గౌర్ అనే విద్యార్ధి గెలుచుకున్నారు.వరుసగా భారత సంతతి విద్యార్ధులే ఈ బహుమతులు గెలుచుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు.అంతేకాదు అమెరికా వ్యాప్తంగా నిర్వహించే స్పెల్ –బి పోటీలలో సైతం భారతీయ విద్యార్ధుల హవా ఉండటం గమనార్హం.