అమెరికాలో భారతీయులు పలు కీలక శాఖలలో విధులు నిర్వహిస్తూ అటు అమెరికాకు, ఇటు భారత్ కు మంచి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నారు.అమెరికాలోని వివిధ శాఖలు, రాజకీయ రంగం, ఐటీ రంగాలలో మనోళ్ళ హవా మాములుగా లేదు.
అయితే కొందరు మాత్రం వెకిలి చేష్టలతో, చిల్లర పనులతో పరువులు పోగొట్టుకుంటూ కటకటాల పాలవుతున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన ఇండో ఎన్నారై అధికారి చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. భారత సంతతికి చెందిన 27 ఏళ్ళ సుఖ్ దేవ్ కాలిఫోర్నియా లోని సాంటా క్లారా కౌంటీ లో లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా విధులు నిర్వరిస్తున్నాడు ముందు నుంచీ దూకుడు స్వభావం ఉన్న సుఖ్ దేవ్ తాను గొప్ప ఆఫీసర్ గా పేరు తెచ్చుకోవాలని భావించేవాడు.అయితే జనవరి ౩1 తేదీన తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని వారినుంచీ ఎంతో తెలివిగా తప్పించుకుని వచ్చానని వారు కాల్పులకు కూడా పాల్పడ్డారని తన అధికారులను నమ్మించాడు.అయితే
సుఖ్ దేవ్ ఊహించని విధంగా తన అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.అసలు తమ తోటి అధికారిపై ఎవరు దాడి చేశారోనని దర్యాప్తు చేపట్టారు.
తనపై దాడి జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.ఈ సమయంలోనే పలు కీలక విషయాలు రాబట్టారు అధికారులు సుఖ్ దేవ్ పై ఎలాంటి దాడి జరగలేదని నిర్ధారించుకున్న అధికారులు కావాలనే అతడు తమవద్ద అబద్దం చెప్పాడని గుర్తించారు.
అధికారులు అందరిని తప్పుదోవ పట్టించినందుకు గాను సుఖ్ దేవ్ ను అదుపులోకి తీసుకున్నారు .