నిర్లక్ష్యంగా కారు నడిపి ముగ్గురు టీనేజర్ల మృతికి కారణమైన భారత సంతతి వ్యక్తిని అరెస్ట్ చేసి హత్య నేరం కింద కేసు బుక్ చేశారు.కాలిఫోర్నియాలోని కరోనా నగరానికి చెందిన అనురాగ్ చంద్ర కారులో వెళ్తూ లాస్ ఏంజిల్స్లోని టెమెస్కాల్ వ్యాలీలో నడిచి వెళ్తున్న ఆరుగురు టీనేజర్లపైకి నిర్లక్ష్యంగా కావాలనే వాహనం పొనిచ్చాడని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ లెఫ్టినెంట్ డేవిడ్ కేసు నమోదు చేశారు.
అతని నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో ఆరుగురు టీనేజర్లలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.మిగతా వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ఘటన అనంతరం అనురాగ్ పరారైపోయాడు.
అయితే ప్రమాదం జరిగిన స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనురాగ్ ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.అనంతరం అతనిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి రివర్సైడ్ కౌంటీ జైలుకి తరలించారు.
ఈ కేసులో అతని నేరం రుజువై, ఉద్దేశ్యపూర్వకంగా ఈ ప్రమాదానికి కారణమయ్యాడని తెలిస్తే పెద్ద శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది.
.