అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.కాటేజ్లో జరిగిన అగ్నిప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త సజీవదహనమయ్యారు.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన డిసెంబర్ 14న జరిగింది.న్యూయార్క్ లాంగ్ ఐలాండ్లోని డిక్స్ హిల్స్ కాటేజ్ హోమ్లో తెల్లవారుజామున 2.53 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్లు ఘటనాస్థలికి చేరుకున్నారు .మంటల్లో చిక్కుకున్న మృతురాలు తాన్య బతిజా (32)ను రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, మంటల తీవ్రత అధికంగా వుండటంతో వారి యత్నాలు విఫలమయ్యాయి.
పొగ పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురైన పోలీసులను చికిత్స నిమిత్తం స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు.
సఫోల్క్ కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ (ఎస్సీపీడీ) ప్రాథమిక విచారణ అనంతరం .అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందేనని తేల్చింది.మృతురాలు … కార్ల్స్ స్ట్రెయిట్ పాత్లోని తన తల్లిదండ్రుల ఇంటి వెనుక వున్న కాటేజ్లో వున్నట్లు పోలీసులు చెప్పారు.
బతిజా తండ్రి గోవింద్ బతిజా ప్రముఖ వ్యాపారవేత్త.
ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలో ఆయనకు మంచి గుర్తింపు వుంది.డిసెంబర్ 14న ఎప్పటిలాగే వ్యాయామం చేసేందుకు గోవింద్ తెల్లవారుజామునే నిద్రలేచాడు.
కిటికీలోంచి చూడగా.కాటేజ్కి మంటలు అంటుకుని వున్నట్లు గమనించాడు గోవింద్.
వెంటనే తన భార్యను అప్రమత్తం చేసి 911కి కాల్ చేసి , కుమార్తెను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
న్యూయార్క్లోని సఫోల్క్ కౌంటీలో వున్న హంటింగ్టన్ పట్టణంలోని లాంగ్ ఐలాండ్లో తాన్యా బతిజా అందరికీ సుపరిచితురాలు.అకౌంటింగ్, ఫైనాన్స్లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమె అనంతరం విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది.ఇటీవలే బెల్ఫోర్డ్లో డంకిన్ డోనట్స్ ఔట్లెట్ను తెరిచిన ఆమె.బ్లూ పాయింట్లో మరో ఔట్లెట్ను ప్రారంభించే పనిలో వుంది.ఈ రోజు రోంకొంకోమా సరస్సులోని మలోనీ లేక్ ఫ్యూనరల్ హోమ్ అండ్ క్రిమేషన్ సెంటర్లో తాన్య అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
సాయంత్రం 4 గంటలకు హిక్స్విల్లేలోని అసమై హిందూ దేవాలయంలో ప్రార్ధనా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.