స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.ఈ సినిమా భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఎదో ఒక అవాంతరం వస్తూనే ఉంది.సినిమా స్టార్ట్ చేసిన ఆరంభంలో దర్శకుడు శంకర్, నిర్మాతలు లైకా ప్రొడక్షన్ మధ్య బడ్జెట్ విషయంలో కాస్తా వివాదం తలెత్తింది.
తరువాత వాటిని దాటుకొని సినిమా స్టార్ట్ చేశారు.అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో క్రేన్ విరిగిపోవడంతో ముగ్గురు అసిస్టెంట్ లు చనిపోయారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకి నిర్మాతలు కోటి రూపాయిల చొప్పున పరిహారం చెల్లించారు.ఇక ఈ అడ్డుని దాటుకొని సినిమా స్టార్ట్ చేద్దామని అనుకునే లోపే కరోనా ఎఫెక్ట్ తో మరల వాయిదా పడింది.
కరోనా లాక్ డౌన్ అనంతరం సడలింపులు ఇచ్చిన షూటింగ్ స్టార్ట్ కాలేదు.దర్శకుడు నిర్మాతలకి బహిరంగంగా సినిమా షూటింగ్ కి సంబంధించి లెటర్ రాసిన ప్రయోజనం లేకుండా పోయింది.
మరో వైపు ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కమల్ హసన్ రాజకీయాలలో బిజీ అయిపోయాడు.ఈ నేపధ్యంలో సినిమా ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు.
దీంతో ఈ సినిమా నుంచి టెక్నికల్ సిబ్బంది ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు.ప్రస్తుతం సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ఉన్న రత్నవేలు ఇండియన్ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.
లైకా ప్రొడక్షన్ తో వచ్చిన విభేదాల కారణంగానే సినిమా నుంచి రత్నవేలు తప్పుకున్నట్లు తెలుస్తుంది.మరి దీనిపై దర్శకుడు శంకర్ ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి.