భారత్, పాకిస్తాన్ల నిన్న ఆసక్తికర మ్యాచ్ జరిగిన విషయం తెల్సిందే.ప్రపంచ కప్లో ఇప్పటి వరకు భారత్పై గెలిచి ఎరుగని పాకిస్తాన్ మరోసారి అదే ఫలితాన్ని చవి చూసింది.
అయితే ఈ మ్యాచ్పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందనే సంచలన వార్తలు ప్రస్తుతం మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
దీనికి అనేక రుజువులు కూడా చూపుతున్నారు.ముందే స్కోర్ ఊహించడం జరిగింది కనుక ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యి ఉండవచ్చు అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్కు చెందిన ముస్లిం లీగ్ యూత్ వింగ్లో పని చేసే అస్లాం ఖాన్ తనోలి అదివారం ఉదయమే ఇరు జట్లు చేసే స్కోర్లను ట్విట్టర్లో ప్రకటించాడు.భారత్ 300 మరియు పాకిస్తాన్ 220 పరుగులు చేస్తుందని అస్లాం ట్వీట్ చేశాడు.
ఇక చివర్లో మూడు, నాలుగు బౌండరీలు కూడా వస్తాయని కూడా అస్లాం ట్వీట్ చేశాడు.అస్లాం అంత ఖచ్చితంగా స్కోర్లు చెప్పడంతో మ్యాచ్పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే భారత క్రికెట్ అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వార్తలను కొట్టిపారేస్తున్నారు.