మహిళల కుటుంబ ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలు ఎన్నో.సాధారణంగా భర్త తరపున ఆస్తికి ఆ భార్యకు హక్కు ఉంటుందని తెలిసిందే.
అయితే తల్లిగారి తరపున ఆస్తికి కూడా ఒక కూతురిగా భాగం ఉందని కోర్టు తీర్పు వెలువరించింది.
ఇదిలా ఉండగా ఈ ఆస్తుల పంపకం విషయంలో సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది.
హిందూ మహిళలు తమకు భర్త తరఫు నుండి వచ్చిన ఆస్తులను పుట్టింటి వారికి ఇవ్వొచ్చని సంచలన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది.అయితే ఈ తీర్పుకు ముఖ్య కారణం జగ్నో అనే మహిళట.
ఇకపోతే 1953 లో జగ్నో భర్త షేర్ సింగ్ మరణించగా, అతడికి వారసత్వంగా వచ్చిన ఆస్తి అతని భార్యగా జగ్నోకు సంక్రమించాయి.ఇట్టి ఆస్తిని తమ సోదరుడి కుమారులకు పంచేందుకు జగ్నో నిర్ణయం తీసుకుందట.
ఈ అంశం పై భర్త తరపు వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాగా ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాఖ్యలు చేసిందట.మొత్తానికి భర్త లేని ఆవిడ ఆస్తిని ఎవరికైన పంచే అధికారాన్ని సుప్రీం కోర్ట్ ఇచ్చిందన్న మాట.