ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇప్పటికీ చాలా దేశాలలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఇండియాలో జనవరి 16 వ తారీకు నాడు ప్రధాని మోడీ చేతుల మీదుగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగింది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే ప్రపంచ చరిత్రలో టీకాల విషయంలో ఇండియాకి తిరుగులేని రికార్డు ఉన్న సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా రంగం దాదాపు 70 శాతం ఇండియాలోనే ఉండటంతో వ్యాక్సిన్ పంపిణీల విషయంలో చాలా దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి.ఇలాంటి తరుణంలో ప్రపంచంలో పేద దేశాలు గా పిలవబడే వాటికి వ్యాక్సిన్ అందించటానికి కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఆలోచన లో భాగంగా భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్సకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
.