మకాం మార్చిన ఐసిస్... భారత్,శ్రీలంక లే టార్గెట్ గా పధకాలు

ప్రముఖ ఉగ్రసంస్థ ఐసిస్ తన మకాం ని మార్చాలని భావిస్తోందట.గతంలో సిరియా,ఇరాక్ లలో పాతుకుపోయిన ఈ ఉగ్రసంస్థ తన మకాన్నీ మార్చినట్లు సమాచారం.

 India Srilanka State Police1 1-TeluguStop.com

భారత్, శ్రీలంకలే టార్గెట్‌గా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పథకాలు రచిస్తున్నారు.ఈ నేపథ్యంలో కేరళ పోలీస్ ఉన్నతాధికారులకు ఆ రాష్ట్ర ఇంటిలిజెంట్ అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తుంది.

ఈ మేరకు ఆ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ మూడు లేఖలను పంపగా, అందులో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదులు ఇప్పటికే మకాం వేశారని అందులో ఉంది.అంతేకాకుండా పలుచోట్ల దాడులు చేసేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారని ఇంటలిజెన్స్ వర్గాలు ఆ లేఖలో పేర్కొన్నారు.

గత కొన్ని సంవత్సరాల్లో వందకు పైగా కేరళవాసులు ఐసిస్‌లో చేరారు.ఉగ్రవాదంవైపు ఆకర్షితులైన యువతను ఆ దారి నుంచి మళ్లించేందుకు 21 కౌన్సిలింగ్ కేంద్రాలు కృషి చేస్తున్నాయి.

వారిలో ఎక్కువగా ఉత్తర కేరళ నుంచి ఉన్నట్లు అక్కడి అధికారి ఒకరు తెలిపారు.ఇప్పటికే శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో 250మంది మరణించిన ఘటన అనంతరం ఉగ్రవాదులపై ఉక్కు పంజా వేసేందుకు అక్కడి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube