దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మారు మ్రోగుతున్న సంగతి తెలిసిందే.గత వారం నుండి ఊహించని విధంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి.
నిన్న ఒక్కరోజే 1026 మంది కరోనా వైరస్ వల్ల మృతి చెందగా, లక్షా 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.సెకండ్ వేవ్ లో ఈ స్థాయిలో ఒక్కరోజే ఈ విధంగా కేసులు నమోదు కావటం ఓ రికార్డు అన్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీన్ని బట్టి చూస్తే ఇండియాలో కరోనా ఉగ్రరూపం దాల్చినట్లు లక్షా ఎనభై వేల కేసులు అంటే మామూలు విషయం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహారాష్ట్రలో 60 వేల కేసులు, ఢిల్లీ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
దీంతో ఇప్పుడు కరోనా కేసుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియా బ్రెజిల్ దేశాని దాటేయడం జరిగిందని అంతర్జాతీయ మీడియా తెలియజేస్తూ ఉంది.చాలా రాష్ట్రాలలో హాస్పిటల్ కరోనా పేషెంట్ లతో నిండి పోతూ ఉండటం తో ఏం చేయలేని పరిస్థితి ఇండియాలో నెలకొంది.
ఇదే పరిస్థితి మరో వారం రోజుల్లో ఇండియాలో కొనసాగితే ఎక్కడికక్కడ శవాలు కుప్పలుతెప్పలుగా ఉంటాయని అంతర్జాతీయ మీడియా ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితిపై కథనాలు మీద కథనాలు ప్రసారం చేస్తూ ఉంది.
.