కొన్ని రోజుల క్రితం ఐక్యరాజ్య సమితిలో మలేషియా ప్రధాని మాట్లాడుతూ ఇండియాలో ఉన్న కశ్మీర్ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొనడంతో పాటు దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది.మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మలేషియాకు ఇండియా నుండి ఫామాయిల్ 90 శాతం ఎగుమతి అవుతుంది.ఆ మొత్తం ఫామాయిల్ ఎగుమతిని నిలిపేయడం జరిగింది.
ఫామాయిల్ దిగుమతి ఆగిపోవడంతో మలేషియా ఆర్థిక అసమానతలతో అవస్థలు పడుతుంది.పలు రంగాలు కూడా కుదేలు అవుతున్నాయి.ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని కాస్త పశ్చాతాపంను కనబర్చాడు.తమ దేశంపై ఇండియా కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తుందని, కాని తాము ఒక చిన్న దేశం.
మేము ఇండియాపై ప్రతీకార చర్యలకు ప్రయత్నించడం లేదు.మేము ఇండియాతో పోటీ పడాలనుకోవడం లేదు.
వారితో పెట్టుకోవాలని మేము అనుకోవడం లేదు అన్నాడు.