ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత భయంకరంగా ఉంది.ఇప్పటికే రెండున్నర మిలియన్ల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇండియాలో 20 వేల కేసులు దాటి కూడా రెండు రోజులు అవుతుంది.పరిస్థితి చూస్తుంటే వైరస్ చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతున్నట్లుగా అనిపిస్తుంది.
నెల రోజులకు పైగా లాక్డౌన్ అమలులో ఉన్నా కూడా పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు.ఇంకాస్త ఆలస్యం అయితే పరిస్థితి ఏంటో అంటూ జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే నెలలో లాక్ డౌన్ను సడలించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే వచ్చే నెలలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.కేవలం మే నెలలోనే 20 వేల నుండి పాతిక వేల వరకు కొత్త కేసులు నమోదు అవుతాయంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఖచ్చితంగా లాక్డౌన్ను సీరియస్గా పాటించాలి.
లేదంటే మాత్రం పెద్ద ప్రమాదం ఇండియాకు తప్పదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మే లో కూడా లాక్డౌన్ను కొనసాగించాల్సి రావచ్చు అంటున్నారు.