దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మరో నాలుగు రోజుల్లో ముగియబోతుంది.ఈ నేపథ్యంలో అంతటా ఒకటే చర్చ.
ఈ లాక్ డౌన్ ముగియబోతుందా లేదంటే కొనసాగుతుందా.ఎక్కువ శాతం కొనసాగడం ఖాయం అంటూ నమ్మకంగా చెబుతున్నారు.
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫ్లోర్ లీడర్స్ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇంకా పలువురు కూడా కేంద్రంకు లాక్ డౌన్ను కొనసాగించడమే మంచిదని సలహా ఇచ్చారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగింపు విషయాన్ని పూర్తిగా రాష్ట్రాలు, వాటి ప్రభుత్వాలకు అప్పగించబోతున్నారు.ఎన్ని రోజులు కావాలి, ఎంత మేరకు లాక్ డౌన్ కావాలి అనే విషయాలను వారే నిర్ణయించుకునేలా కేంద్రం ఒక ఆదేశాన్ని జారీ చేయబోతుంది.
కొన్ని రాష్ట్రాల్లో మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ విధించినా కష్టంగానే ఉంటుంది.మరి కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అక్కర్లేదు.మరి కొన్ని రాష్ట్రాలో రెండు వారాలు కావాల్సి ఉంది.అందువల్ల రాష్ట్రాలకే నిర్ణయాధికారాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.