ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.వారం క్రితం సింగిల్ డిజిట్కే పరిమితం అయిన పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 303కు చేరింది.
ఇందులో ఎక్కువ శాతం మంది దిల్లీ మత సమావేశాలకు వెళ్లి వచ్చిన మూలాలే ఉండటం విషాదం.రాష్ట్రంలో ఎక్కువగా కర్నూలులో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
నేడు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లెక్కల ప్రకారం కొత్తగా 37 కేసులు నమోదు అయ్యాయి.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 37 కేసులు నమోదు అయ్యాయి అని, అందులో అత్యధికంగా కర్నూలులో 18 కేసులు, నెల్లూరులో 8 గోదావరి జిల్లాల్లో 13 కేసులు నమోదు అయ్యాయి.
నేటితో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరింది.శ్రీకాకుళం ఇంకా విజయనగరం జిల్లాల్లో పాజిటివ్ల సంఖ్య ‘0’ గా ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం.
ప్రస్తుతం ఆ రెండు జిల్లాలకు పూర్తిగా రాకపోకలు నిషేదించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక మీదట కూడా అక్కడ పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం లేదని అంటున్నారు.