ఇండియా పొరుగున ఉన్న చైనాతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నదని అందరూ అంటూ ఉంటారు.ప్రధానంగా అమెరికన్ మీడియా చైనాతో భారత్ పోటీ పడుతోందని, ఆసియాలో ఈ రెండు దేశాలు బలమైన ఆర్ధిక వ్యవస్థలని చెబుతూ ఉంటుంది.
అయితే భారత్ను చైనా తీసి పారేసింది.అభివృద్ధి విషయంలో, ఆర్ధిక వ్యవస్థలో ఇండియాకు, తమకు పోలిక లేదని చైనాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక పత్రిక తెగేసి చెప్పింది.
అన్ని రంగాల్లోనూ భారత్ తమ దేశం కంటే వెనుకబడి ఉందని తెలిపింది.గత 5 సంవత్సరాల్లో చైనా దరిదాపులకు రాలేదని స్పష్టం చేసింది.
వస్తు తయారీ రంగంలో, రవాణా రంగంలో, మౌలిక వసతుల రంగంలో ఐదేళ్ళు వెనుకబడి ఉందని తెలిపింది.అయితే అమెరికా నుంచి వెలువడే న్యూయర్క్ టైమ్స్ కథనం ఇందుకు భిన్నంగా ఉంది.
భారత్ సమీప భవిషత్తులో చైనా స్థానం ఆక్రమిస్తుందని తెలిపింది.అమెరికాకు ఇండియాతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అలా చెప్పి ఉండొచ్చు.
కానీ అభివృద్ధి విషయంలో చైనాయే ముందు ఉంది.చైనాను సందర్శించే భారతీయులు అక్కడి అభివృద్ధికి ఆశ్చర్య పోతుంటారు.
ఇండియాలో ఒక బడికి భవనం కట్టడానికి మూడు నాలుగేళ్ళు పడుతుంది.కానీ చైనాలో ఎంత పెద్ద భారీ నిర్మాణం అయినా చాలా తొందరగా పూర్తి చేస్తారు.
చైనా పాలకులకు ఉన్నంత అంకిత భావం, చిత్తశిద్ధి భారతీయులకు లేవనే విషయం అందరికీ తెలిసిందే.ఇండియాలో మౌలిక వసతులు చాలా తక్కువ.
ఇప్పటికీ సగం దేశంలో మరుగుదొడ్లు లేవంటే అభివృద్ధి ఎంత వుందో అర్ధం చేసుకోవచ్చు.