ప్రస్తుతం IT పరిశ్రమలకు గడ్డు పరిస్థితి నడుస్తోంది.ఆర్థిక మాంద్యం భయాలతో ఐటీ ఉద్యోగుల పరిస్థితి చాలా అద్వాన్నంగా వుంది.
ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటివి కూడా తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించిన సంగతి విదితమే.ఈ న్యూస్ బయటకు వచ్చిన తరువాత ప్రతీ IT ఉద్యోగి తన వుద్యోగం సెక్యూరిటీ విషయంలో కాస్త ఇబ్బందులకు లోనవుతున్నారు.
ఈ క్రమంలో ఓ ఇండియన్ ఐటీ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చి, మిగతా IT ప్రపంచం తనవైపు చూసేలా చేసింది.
ఆ కంపెనీనే జరాత్ కేంద్రంగా పని చేస్తున్న త్రిధ్యా టెక్ ఐటీ కంపెనీ.మంచి పనితీరు కనబరిచిన వారికి లక్షల విలువచేసే కార్లు కానుకగా అందించి హాట్ టాపిక్ గా మారింది.ఈ సంస్థను స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసున్న నేపథ్యంలో అందుకు కారణం ఉద్యోగులేనని, ఈ కారణంగానే 13 మందికి ఖరీదైన కార్లను గిఫ్ట్గా అందించింది.
అవును, గూగుల్, మెటా వంటి మల్టీనేషనల్ కంపెనీలు వేలాది మందిని తొలగిస్తున్న వేళ త్రిధ్యా టెక్ 13 మందిని ఖరీదైన కార్లు కానుగా ఇచ్చి సత్కరించడం గమనార్హం.
అంతేకాకుండా, భవిష్యత్తులో కూడా మరిన్ని కార్లను కానుకగా ఇచ్చే ఆనవాయితీ కొనసాగుతుందని MD పేర్కొన్నారు.మరోవైపు.కార్లు అందుకున్న 13 మందిలో ఓ ఉద్యోగి మాట్లాడుతూ ప్రతిఒక్కరి హార్డ్వర్క్కు ఈ కంపెనీలో ప్రోత్సాహం లభిస్తోందన్నారు.
సంస్థ కోసం కృషి చేస్తే మంచి ఫలితాలను వస్తాయని, అదే నిజమైన విషయం అని అన్నారు.ఈ నేపథ్యంలో తమ సంస్థ నుంచి కారు అందుకోవడం అనేది వర్ణానాతీతమని తెలిపారు.
ఈ కామర్స్, వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సేవలను అందించే కంపెనీ త్రిధ్య టెక్ అహ్మదాబాద్ కేంద్రగా ఆసియా, యూరప్, ఆస్ట్రేలియాలోని క్లయింట్లకు సేవలందిస్తోంది.