బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ వేట కొనసాగుతోంది.బాక్సింగ్ లో మరో రెండు పసిడి పతకాలతో పాటు ట్రిపుల్ జంప్ లోనూ స్వర్ణ పతకాన్ని చేజిక్కుంచుకుంది.
మహిళల బాక్సింగ్ 48 కిలోల విభాగంలో నీతూ ఘంఘాస్ ఇంగ్లండ్ కు చెందిన డెమీ జేడ్ రెస్జాన్ ను 5-0తో పోటీ పడింది.పురుషుల బాక్సింగ్ 51 కిలోల విభాగంలో అమిత్ పంఘాస్ ఇంగ్లండ్ బాక్సర్ కైరన్ మెక్ డొనాల్డ్ పై 5-0తో విజయభేరి మోగించాడు.
ట్రిపుల్ జంప్ లో ఎల్డోస్ పాల్ అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణం అందుకున్నాడు.
మరోవైపు, అథ్లెటిక్స్ లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ స్వర్ణం సాధించగా, భారత్ కు చెందిన అబూబకర్ కు ఇదే క్రీడలో రజతం దక్కింది.ఎల్డోస్ పాల్ తన అత్యుత్తమ ప్రదర్శన 17.03 మీటర్లు నమోదు చేసి రెండోస్థానంలో నిలిచాడు.దీంతో అథ్లెటిక్స్ లో మరో రెండు కాంస్యాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి.మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి, పురుషుల 10 వేల మీటర్ల నడకలో సందీప్ కుమార్ కాంస్యం నెగ్గారు.