అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు.అందరి అధ్యక్షులకంటే కూడా తాను ఓ ప్రత్యేకమైన వైఖరిని కలిగిఉంటారు.
సాదా సీదా వ్యక్తి కాకపోయినా సాధారణ వ్యక్తిలా ఉండటమే ఆయన్ని ఇప్పటికి అమెరికా ప్రజలలో గుండెల్లో నిలిచిపోయేలా చేసింది.కేవలం అమెరికన్స్ మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో ఎంతో మందికి ఒబామా జీవితం స్పూర్తి దాయకం.
ఒబామ తన అధ్యక్ష పదవి నుంచీ వైదొలగిన తరువాత తన బిజినెస్ పనులపై ద్రుష్టిపెడుతూనే తనకి ఎంతో ఇష్టమైన “ఏ ప్రామిస్డ్ ల్యాండ్” పుస్తకం కోసం సమయాన్ని వెచ్చించే వారు.
“ఏ ప్రామిస్డ్ ల్యాండ్” ఒబామ ఆత్మకధ.
ఒబామా జీవితానికి సంభందించిన ఎన్నో విషయాలు అందులో రాసుకొచ్చారు.అన్ని దేశాలపై తనకున్న అభిప్రాయాన్ని అక్కడి సంప్రదాయాలను ఈ పుస్తకంలో వెల్లడించిన ఒబామా భారత్ పై మాత్రం ప్రత్యేకమైన ప్రేమను చూపించారనే చెప్పాలి.
ముఖ్యంగా భారత్ అంటే హిందూ దేశం, మన దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్న ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలపై ఒబామా ప్రత్యేకమైన ప్రేమని గౌరవాన్ని చూపించారు.
తాను చిన్నతనంలో ఇండోనేషియా లో ఉండేవాడినని, రామాయణం, మహాభారతం కధలు అప్పట్లో వినేవాడిని భారత్ పై ప్రేమ, అభిమానం పెరగడానికి అవే ముఖ్య కారణమని తెలిపారు.భారత్ యొక్క భౌగోళిక స్వరూపం తనను ఎంతో ఆకర్షించిందని అన్నారు.ఎన్నో జాతులు, మరెన్నో బాషలు ఉన్నాయని తాను భారత్ పర్యటన వెళ్ళినపుడు అక్కడి గౌరవ మర్యాదలకు ఎంతో ముచ్చటవేసిందని, ఇండోనేషియాలో చదువుకునే రోజుల్లో తనకు భారత్ లో మంచి మిత్రులు ఉండేవారని ఒబామా భారత్ తో ఉన్న అనుభందాన్ని తన పుస్తకంలో వెల్లడించారు.