ఇండియా సహా పలు దేశాలలో కరోనా వైరస్ భారీగా వ్యాప్తి చెందుతున్నట్లు దీంతో ఇటు వంటి దేశాల్లో వెళ్లాలని దేశ పౌరులు భావిస్తే మూడు సంవత్సరాల పాటు దేశంలోకి రానివం అని సరికొత్త ఆదేశాలు సౌదీ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది.భారత్, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, పాకిస్తాన్, టర్కీ, యూఏఈ, ఈజిప్ట్ వంటి దేశాలలో కరోనా విలయ తాండవం చేస్తున్నట్లు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నట్లూ సౌదీ.
ఈ దేశాలను రెడ్ లిస్టులో పెట్టడం జరిగింది.
రెడ్ లిస్టులో ఉన్న దేశాలకు వెళితే కనుక సౌదీలో కి రాకుండా మూడేళ్లపాటు బ్యాన్ విధిస్తామని దేశ పౌరులకు సౌదీ అరేబియా ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది.
చాలావరకు కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు ప్రభుత్వ పెద్దలు తెలుపుతూ ఉండటంతో మరోపక్క ఇండియాలో కూడా ఎక్కడికక్కడ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది.ఒకపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేస్తూనే మరో పక్క హాస్పిటల్స్ లో ఎటువంటి కొరత లేకుండా చూసుకుంటూ ఉంది.
ఇదే తరహాలో మిగతా దేశాలలో కూడా కరోనా కట్టడి చేయడానికి కట్టిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. అయినా కానీ సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.