మే 30 వ తారీఖు భారత చరిత్రలో మరువలేని రోజుగా మారింది.ఒకపక్క భారత ప్రధానిగా నరేంద్రమోడీ రెండవ సారి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో అబుదాబి లో భారత్ కు అరుదైన గౌరవం దక్కింది.
ప్రధాని గా మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అబుదాబిలోని ప్రఖ్యాత ఏడీఎన్ఓసీ టవర్లపై భారత మువ్వన్నెల జెండాతో పాటు ఆ దేశ జాతీయ పతాకాన్ని కూడా ప్రదర్శించడం తో ఒక్కసారిగా భారత కీర్తి మరింత పెరిగినట్లు అయ్యింది.అలాగే ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మోడీ షేక్ హ్యాండ్ ఇస్తున్నఫోటోను కూడా ఆ సమయంలో ప్రదర్శించడం విశేషం.
ఈ అరుదైన ఘటనతో భారత్,యూఏఈ ల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో కూడా రిలీజ్ చేసారు.
అబుదాబిలోని భారత రాయబారి నవదీప్ సింగ్ పూరి ట్విటర్ ద్వారా ఈ వీడియో ని షేర్ చేశారు.