2019 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఈ రోజు భారత తుది జట్టుని ప్రకటించింది.పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన ఎంపికలు ఏమి జరగలేదు.
గత కొద్ది రోజులుగా భారత్ ని ఇబ్బంది పెడుతున్న నెంబర్ 4 స్థానానికి చాలా మంది ఆటగాళ్లను ప్రయత్నించారు అందులో మన తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఒకరు అతనికి ఈ సారి బీసీసీఐ మొండిచెయ్యి చూపించింది.నెంబర్ 4 స్థానం కోసం యువ ఆటగాడు విజయ్ శంకర్ తో బరిలోకి దిగనుంది.రిషబ్ పంత్ , అంబటి రాయుడు , యువరాజ్ సింగ్ , సురేష్ రైనా లు కూడా తుది జట్టుకు ఎంపిక కాలేదు.
1)వీళ్ళే రిజర్వ్ ఓపెనర్ , వికెట్ కీపర్.
రానున్న వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ తో ఓటు శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయనున్నాడు.అయితే వీరికి రిజర్వ్ ఓపెనర్ గా KL.రాహుల్ ని ఎంపిక చేసారు.మాజీ భారత కెప్టెన్ MS ధోని ఈ ప్రపంచ కప్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా ఆడనున్నాడు , ఇతనికి ప్రత్యామ్నాయంగా దినేష్ కార్తిక్ ని ఎంపిక చేసారు.
ఇకపోతే బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా నేతృత్వంలో మహమ్మద్ షమీ , భువనేశ్వర్ కుమార్ తో పాటు హార్దిక్ పాండ్య భారత పేస్ బౌలింగ్ ని ప్రాతినిధ్యం వహించనున్నారు.2008 లో అండర్ 19 ప్రపంచ కప్ కెప్టెన్ గా ఇండియా కి వరల్డ్ కప్ తెచ్చిన విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ లో జరిగే ప్రపంచ కప్ కి భారత కెప్టెన్ గా భాద్యతలు తీసుకోబోతున్నారు.
2)ఇంగ్లాండ్ లో జరిగే ప్రపంచ కప్ కి ఆడబోయే భారత జట్టు తుది 15 ఆటగాళ్లు వీరే.
రోహిత్ శర్మ ( వైస్ కెప్టెన్ ) శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీ ( కెప్టెన్ ) విజయ్ శంకర్ కేదార్ జాధవ్ కె.ఎల్.రాహుల్ ఎం.ఎస్ .ధోని ( వికెట్ కీపర్ ) దినేష్ కార్తిక్ హార్దిక్ పాండ్య రవీంద్ర జడేజా యుహిందర్ చహల్ కుల్దీప్ యాదవ్ భువనేశ్వర్ కుమార్ మహమ్మద్ షమీ జస్పిరిత్ బుమ్రా
.