సీఎంలతో పీఎం వీడియో కాన్ఫెరెన్స్‌

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న ఈ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు మరోసారి సీఎంలతో వీడియో కాన్ఫెరెన్స్‌లో చర్చించబోతున్నారు.ఇటీవలే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎంలతో ఇంకా మీడియా అధినేతలతో మోడీ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించిన విషయం తెల్సిందే.

 Indian Prime Minister Narendra Modi Video Conference To All States Cm's, India,-TeluguStop.com

నేడు మరోసారి సీఎంలతో చర్చించి రాష్ట్రాల పరిస్థితులు అడిగి తెలుసుకోబోతున్నారట.

సీఎంల నుండి పూర్తి సమాచారంను తీసుకోవడంతో పాటు ఈ విపత్తు కాలంలో ఏం చేస్తే బాగుంటుందనే సలహాలు కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ కరోనా విపత్తు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెల్సిందే.ఆ లాక్‌ డౌన్‌ ప్రభావం రాష్ట్రాపై ఎలా ఉంది, దాని వల్ల కరోనా వ్యాప్తి తగ్గుదల గురించి కూడా పీఎం సీఎంలతో చర్చించబోతున్నారు.

దాదాపు గంట పాటు ఈ వీడియో కాన్ఫెరెన్స్‌ జరుగబోతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.పీఎం వీడియో కాన్ఫెరెన్స్‌ కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి డేటాతో సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube