కరోనా వైరస్ ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నింటిపై ప్రభావం చూపించింది.ప్రపంచ యుద్దాలు అయినా కొన్ని దేశాలపై ప్రభావం చూపించవు.
కాని కరోనా మాత్రం ప్రపంచ యుద్దాలను మించి అల్ల కల్లోలం సృష్టిస్తుంది.అన్ని వ్యవస్థలు దారుణంగా దెబ్బ తింటున్నాయి.
ఇండియాలో కరోనా ప్రభావం విద్యా వ్యవస్థపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది.మార్చి ఏప్రిల్ నెలల్లో పూర్తిగా విద్యార్థులు పరీక్షలపై దృష్టి పెడుతూ ఉంటారు.
కొత్త అకడమిక్ ఇయర్ కూడా ప్రారంభం అవ్వడంతో పిల్లలకు చాలా చాలా కీలకంగా చెప్పుకోవచ్చు.కాని కరోనాతో అంతా పడకెక్కేసింది.
ఇంటర్ పరీక్షలు పూర్తి అయినా మూల్యాంకనం చేయడం లేదు.పదవ తరగతి పిల్లల పరీక్షలు సగం జరిగి సగం ఆగాయి.ఇక ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పీజీసెట్ ఇంకా పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షలు మెడికల్ ఎంట్రెన్స్ టెస్టు ఇలా రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో జరగాల్సిన పరీక్షలు దాదాపు అన్ని కూడా తీవ్రంగా ప్రభావం పడుతున్నాయి.ఈ పరీక్షలు అన్నీ ఎలా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి విద్యా సంవత్సరంను ఎప్పుడు ప్రారంభించాలి, అసలు కరోనా ఎప్పటి వరకు ఉంటుందనే విషయంలో విద్యా శాఖ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక విద్యార్థుల పరిస్థితి సరే సరి.
.