కరోనా వైరస్ ను నియంత్రించడానికి అన్ని దేశాలు కలిసి ముందడుగు వేస్తున్నాయి.ప్రపంచ దేశాలకు వారి ప్రజలను కాపాడటానికి భారత్ ఔషధాలు పంపి సాయం చేస్తోంది.
ఇప్పటికే అమెరికాకు కరోనా నియంత్రణ కోసం మందులు పంపి సాయం చేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు శ్రీలంకకు కూడా ఔషదాలు పంపి సాయం చేసింది.
శ్రీలంకలోనూ కరోనా విజృంభించడంతో తమను ఆదుకోవాలని ఇటీవల భారత్కు శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ దేశానికి కరోనా నిర్ధారణ, చికిత్సకు అత్యవసరమైన వైద్య పరికరాలతో పాటు వైద్యుల రక్షణ సామగ్రి, మాస్కులను పెద్ద ఎత్తున పంపింది.
సుమారు పది టన్నుల పరికరాలను శ్రీలంకకు ప్రత్యేక విమానంలో భారత్ పంపించింది.
దీంతో ఈ విషయంపై శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ట్వీట్ చేస్తూ ప్రధాని మోదీకి, భారతదేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆ ట్వీట్ లో ”భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వం, ప్రజలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.శ్రీలంకకు ప్రత్యేక విమానం ద్వారా అవసరమైన ఔషధాలు పంపి భారత్ సాయం చేసింది.
కరోనాతో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో గొప్ప సాయాన్ని అందించారు” అని శ్రీలంక అధ్యక్షుడు పేర్కొన్నారు.అంతేకాదు ప్రాణాలు కాపాడే 10 టన్నుల ఔషధాల ఫొటోలను పోస్ట్ చేశారు.
.