భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ ఏ రేంజ్ లో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.దీనితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇక గడిచిన వారం రోజుల నుంచి ప్రతిరోజూ తప్పకుండా 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఇక దేశంలో తాజాగా గడిచిన 24 గంటల్లో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో.
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665 కు చేరుకుంది.
ఇక మరోవైపు దేశంలో కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది.
ఇక నిన్న ఒక్కరోజే దేశంలో దాదాపు 467 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు.దీనితో భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 20,160 కు చేరుకొంది.
ఇక ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ బారి నుండి కోలుకొని 4,39,948 మంది పూర్తి ఆరోగ్యంతో బయట పడ్డారు.
అలాగే దేశంలో 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇంకా ప్రస్తుతం ప్రపంచంలో వైరస్ వ్యాప్తి చెందడంలో భారత్ ప్రపంచంలోనే భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది.