బోర్డర్ లో గత మూడు నెలల నుండి పాగా వేసుకొని కూర్చున్న చైనా భారత్ ఇచ్చిన షాక్ తో గిలగిలలాడుతుంది.అందుకే రోజూ బోర్డర్ లో భారత్ పై ఆధిపత్యాన్ని సాధించడం కోసం వరసుగా ఎత్తులు వేస్తూ భారత్ చేతిలో చిత్తు అవుతూ అభాసుపాలు అవుతుంది.
ఇక పాంగాంగ్ లేక్ వద్ద మూడు నెలల నుండి తిష్టవేసిన చైనాకు బుద్ధి చెప్పడానికి దక్షిణ పాంగాంగ్ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.
భారత్ ఇలాంటి వ్యూహం అనుసరిస్తోందని ఊహించని చైనా ఇక అప్పటి నుండి భారతదేశం దుందుడుకుగా వ్యవహరిస్తోందని కథలు చెప్పడానికి ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే భారత్ తమ భూభాగంలోకి చొచ్చుకొని రావడానికి ప్రయత్నించిందని కల్లబొల్లి కబుర్లు చెప్పింది.
తాజాగా చైనా ఆరోపించినట్లు భారత సైనికులు చైనా భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లలేదని నిరూపించడానికి కొందరు విశ్లేషకులు తమ సోర్సెస్ ద్వారా ఆ ప్రాంత శాటిలైట్ ఇమేజెస్ ను సంపాదించారు.దాని ప్రకారం భారత్ అసలు చైనా భూభాగంలోకి వెళ్లడానికి ప్రయత్నించలేదని స్పష్టమవుతుంది.
కావాలంటే దాని పై మీరు కూడా ఓ లుక్ వేయండి.