“భారత సంతతి” విద్యార్ధినికి ప్రతిష్టాత్మక...“స్కాలర్”

భారతీయులు వరుసగా అమెరికాలో ప్రతిభని చాటుతున్నారు.వరుస విజయాలతో తమ అనన్యసామాన్యమైన ప్రతిభతో భారతీయులు అందరూ గర్వపడేలా అత్యన్నతమైన శిఖరాలు అధిరోహిస్తున్నారు.

 India Born Woman Nri Student To Get Young Scholar Award In Us-TeluguStop.com

ఒక పక్క శాస్త్రవేత్తలు మరో పక్క విద్యావేత్తలు.ఇంకోపక్క విద్యార్ధులు ఇలా ఒకరి తరువాత ఒకరు తమ తమ ప్రతిభతో అమెరికా వంటి అగ్రరాజ్యంలో భారతీయ సత్తా చాటుతున్నారు.

వివరాలలోకి వెళ్తే.

భారత సంతతికి చెందిన విద్యార్ధిని 2018 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మకమైన మార్కొని సొసైటీ పాల్‌ బరన్‌ యంగ్‌ స్కాలర్‌ అవార్డుకు ఎంపికయ్యారు.ఈ విద్యార్ధిని పేరు రాజలక్ష్మి నందకుమార్‌.ప్రాణంతక రోగాలని స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించి ఎంతో సమర్ధవంతంగా తెలుసుకునేందుకు ఆ యువతి చేసిన పరిశోధనకి గాను ఈ అత్యున్నతమైన అవార్డుకి ఎంపిక చేశారు.

ఇదిలాఉంటే ఈ అవార్డు పొందిన రాజ్యలక్ష్మి చెన్నైలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచ్‌లర్‌ డిగ్రీ పూర్తి చేసి నందకుమార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో అధ్యయనం చేస్తున్నారు.ఈ అవార్డు కింద ఆమెకు 5 వేల డాలర్లు నగదు అందజేస్తారు.ఈ అవార్డు అందుకున్న భారతీయ విధ్యర్దినిగా ఆమె రికార్డు సృష్టించారు.అయితే అమెరికాలో ఉంటున్న భారతీయ ఎన్నారై సంఘాలు ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు .

2 Attachments

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube