1993లో చోటు చేసుకున్న ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా నిరూపితమైన 42 నెలలుగా జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ ఉదయం విడుదల కావటం తెలిసిందే.వాస్తవానికి ఆయన గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కావాల్సి ఉంది.
భద్రతా కారణాల వల్ల రెండు గంటల ముందే ఆయన్ను విడుదల చేశారు.సుదీర్ఘకాలం పాటు జైలు జీవితాన్ని గడిపిన సంజయ్ జైలు గేటు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏం చేశారన్నది చూస్తే.
కాస్త ఆసక్తికరంగా ఉంటుంది.
నీలం రంగు చొక్కా ధరించిన సంజయ్ జైలు గేటు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన భుజాన పెద్ద బ్యాగ్.
కొన్ని ఫైళ్లను చేత్తో పట్టుకొని బయటకు వచ్చారు.అనంతరం బ్యాగును కింద పెట్టిన సంజయ్.
నేలను మద్దాడారు.ఆపై జైలు వైపునకు తిరిగి ఎరవాడ జైలు పైన ఎగురుతున్న జాతీయజెండాకు సెల్యూట్ చేశారు.
ఆయన్ను చూసేందుకు వెయిట్ చేస్తున్న అభిమానులు.మీడియాను ఉద్దేశించిన ఒకేఒక్క మాట మాట్లాడిన సంజయ్?.స్వేచ్ఛ అంత సులభంగా అందదన్న మాటను చెప్పి వెళ్లి పోయారు.ఏమైనా.సంజయ్ జైలు బయటకు వచ్చిన సీన్ అత్యంత నాటకీయంగానూ.భావోద్వేగంతో నిండి ఉందని చెప్పక తప్పదు.